Today news - నేటి సమగ్ర వార్తా సమాహరం - bikki news

Today News – నేటి సమగ్ర వార్తా సమాహరం

BIKKI NEWS (FEB. 18) : Today news headlines 18th February 2026 in Telugu. నేటి తెలంగాణ, ఏపీ, జాతీయ, అంతర్జాతీయ, క్రీడా, బిజినెస్, విద్యా ఉద్యోగ వార్తల సమాహారం…

Today news headlines 18th February 2026 in Telugu

Today Telangana News

ఫిబ్రవరి 23న తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.

బయో ఆసియా సదస్సు హైదరాబాద్ వేదికగా ప్రారంభమైంది.

గ్లోబల్ వ్యాక్సిన్ హబ్ గా తెలంగాణ నిలుస్తుందని సీఎం రేవంత్ అన్నారు

100 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ – 4 ను ప్రారంభించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

తెలంగాణ కోర్ అర్బన్ ప్రాంతంలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

డేటా సెంటర్ లింకు వివిధ రాష్ట్రాలు ఇస్తున్న రాయితీలు పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులందరికీ 1 గంట ముందు కార్యాలయాలు వదిలి వెళ్ళడానికి అనుమతి.

ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక వాయిదా.

Today Andhra Pradesh news

అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష 2026 కు హాజరు కావడానికి విశాఖ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

సినీనటి ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీఠం ఏర్పడినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావం రాష్ట్రంపై ఉండదని తెలిపింది.

మే 1 నుండి 30 వరకు గృహ గణన చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించారు

Today national news

పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ అస్సాం పుదుచ్చేరి రాష్ట్రాలకు ఏప్రిల్ లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

ముంబైలో భేటీ అయిన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్. 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కు ఒప్పందం కుదిరే అవకాశం.

కమలహాసన్ MNM పార్టీకి టార్చ్ లైట్ గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘం.

నీకోబార్ ప్రాజెక్టులకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది

Today International news

ఎంపీల పెన్షన్లను రద్దు చేస్తూ శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

సౌదీ అరేబియాలో దర్శనమిచ్చిన రంజాన్ నెలవంక. రంజాన్ పవిత్ర మాసం ప్రారంభం.

అమెరికా పౌర హక్కుల నేత జెస్సీ జాక్సన్ మృతి

భారత్ సహాయం తమకు అత్యంత అవసరం అని ఐరాస నేత గుటెరస్ తెలిపారు

Today business news

సెన్సెక్స్ 173 పాయింట్లు, నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో ముగిశాయి. (నేటి స్టాక్ మార్కెట్ అంచనాలు)

మంగళవారం భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు (నేటి బంగారం, వెండి ధరలు

AI DATA సెంటర్ లోనై 9 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి అదానీ గ్రూప్ సిద్దం.

ప్రపంచలో తొలి ట్రిలియనీర్ గా ELON MUSK

Today sports news

ICC T20 WORLD CUP 2026 నుంచి లీగ్ దశలోనే వెనుదిరిగిన ఆస్ట్రేలియా జట్టు.

SUPER 8 – సూపర్ 8 కు చేరిన ఇండియా, వెస్టిండీస్, జింబాబ్వే, సౌతాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు మరియు USA లేదా పాకిస్తాన్ జట్లలలో ఒకటి సూపర్ 8 కు చేరుకోనుంది.

ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన చికిత్స అందించాలని భారత దిగ్గజ క్రికెటర్ లు కపిల్ దేవ్, గవాస్కర్ లు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరారు.

వీసా హక్కు కాదని, అమెరికా చర్యలకు పాల్పడితే రద్దు చేస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.

Today education and jobs updates

తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 హాల్ టిక్కెట్లు నేడు విడుదల చేయనున్నారు

తెలంగాణ వ్యవసాయ శాఖ 10909 వాలంటీర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

25,487 SSC GD కానిస్టేబుల్ పరీక్ష వాయిదా పడింది.

NIFT 2026 ప్రాథమిక కీ విడుదల

TGEAPCET 2026 దరఖాస్తు కోసం మొబైల్ యాప్

CMAT 2026 FINAL KEY విడుదల

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →