BIKKI NEWS (FEB. 19) : TODAY TOP NEWS IN TELUGU 19th FEBRUARY 2026 – సమగ్ర వార్తా సంకలనం
TODAY TOP NEWS IN TELUGU 19th FEBRUARY 2026
TODAY TELANGANA NEWS
తెలంగాణ కోర్ అర్బన్ ప్రాంతంలో కాలుష్యకారక పరిశ్రమలను వచ్చే ఐదు సంవత్సరాలలో తొలగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. ఆర్వో దే బాధ్యత అని తెలిపింది.
మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని మంత్రి సీతక్క తెలిపారు.
IBOMMA RAVI – జైలు నుండి ఐ బొమ్మ రవి బెయిల్ పై విడుదల.
TODAY ANDHRA PRADESH NEWS
పిపిపి పద్ధతిలో 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తామని మంత్రి సత్య కుమార్ తెలిపారు.
INS సుమేదాపై ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం చంద్రబాబు.
అన్నమయ్య జిల్లాలో చిన్నారిపై అత్యాచారం చేసిన కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఎస్పీ తెలిపారు.
బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులను జారీ చేసింది
తెలుగు రాష్ట్రాలలో పలు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
మాజీ మంత్రి అంబటి రాంబాబు మెయిల్ మంజూరు, జైలు నుండి విడుదల.
TODAY NATIONAL NEWS
భారత్ లో కనిపించిన నెలవంక, నేటి నుండి రంజాన్ మాసం ప్రారంభం.
మహిళల దుస్తులను లాగటము అత్యాచారం కిందికే వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని కేంద్ర ఐటీ మంత్రి తెలిపారు.
విద్యా ఉద్యోగాల్లో ముస్లింలకు ఉన్న ఐదు శాతం కోటాను మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది
37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది . మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి.
తొలి స్వదేశీ కెడేట్ శిక్షణ నౌక INS KRISHNA జలప్రవేశం చేసినట్లు నేవీ అధికారులు తెలిపారు.
దేశంలో బ్రాడ్ బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 100 కోట్లకు చేరింది .
భారత్ ప్రాన్స్ మధ్య 21 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
2030 నాటికి 30 వేల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు అందిస్తామని ప్రాన్స్ అధ్యక్షుడు తెలిపారు.
కర్ణాటకలో వేమగల్ ప్రాంతంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లింగ్ యూనిట్ ను ప్రారంభించారు.
TODAY INTERNATIONAL NEWS
బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా యూనస్ అంటూ స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇమ్రాన్ ఖాన్ హత్యకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నఖ్వీ కుట్ర చేస్తున్నారంటూ ఇమ్రాన్ ఖాన్ సోదరి ఆరోపించారు.
హర్ముజ్ జల సందిలోని కొన్ని భాగాలను మూసివేసిన ఇరాన్ ప్రభుత్వం
TODAY BUSINESS NEWS
Stock market – వరుసగా మూడో రోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్. సెన్సెక్స్ 283, నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో ముగిశాయి. (నేటి స్టాక్ మార్కెట్ స్ట్రాటజీ)
నేటి బంగారం, వెండి, ప్లాటినం ధరలు, డాలర్ తో రూపాయి మారకం విలువ.
భారత్ అమెరికాల మధ్య sub sea cable connectivity ని ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు.
నేను ఇండియాకు తిరిగి రాలేనంటూ బాంబే హైకోర్టుకు తెలిపిన విజయ్ మాల్యా
TODAY SPORTS NEWS
IND VS NED – ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై విజయం సాధించింది.
పాకిస్తాన్ జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సూపర్ 8 దశకు చేరుకుంది.
67 ఏళ్ల చరిత్రలో తొలిసారి జమ్మూ కాశ్మీర్ జట్టు రంజీ ట్రోఫీ 2026 ఫైనల్ కు చేరింది.
TODAY EDUCATION AND JOBS UPDATES
తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 హాల్ టికెట్లను కళాశాలలో లాగిన్ లో అందుబాటులో ఉంచారు
TG EAPCET 2026 దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం.
TGPSC RIMC – డెహ్రాడూన్ లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కళాశాలలో ఎనిమిదవ తరగతి అడ్మిషన్లకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది
POSTAL GDS APPLICATION EDIT OPTION అందుబాటులోకి వచ్చింది.
మార్చి మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు హాల్ టికెట్లు విడుదల చేయనున్నారు
తెలంగాణ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల మధ్యలో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు
ఫిబ్రవరి 23 నుండి ప్రారంభం కానున్న ఏపీ ఇంటర్ పరీక్షలు సీసీ కెమెరాల నిఘా లో నిర్వహించనున్నారు

