BIKKI NEWS (FEB. 18) : INDIA WON AGAINST NETHERLANDS IN ICC T20 WORLD CUP. ఐసిసి టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ తన చివరి లీగ్ మ్యాచ్ (IND VS NED) లో నెదర్లాండ్స్ పై 17 పరుగులు తేడాతో విజయం సాధించింది.
IND vs NED- INDIA WON AGAINST NETHERLANDS IN ICC T20 WORLD CUP.
టి20 వరల్డ్ కప్ లలో భారత్ కు ఇది వరుసగా 12వ విజయం కావడం విశేషం.
దీంతో లీగ్ దశలో ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ సగర్వంగా సూపర్ 8 దశకు చేరింది.
బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 193/6 పరుగులు సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ శివం దూబే 66 పరుగులు సాధించి, కీలక ఇన్నింగ్స్ ఆడి భారీ స్కోరుకు బాటలు వేశాడు
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన నెదర్లాండ్స్ జట్టు చివరి వరకు పోరాడి 176/7 పరుగులు సాధించి, విజయానికి 17 పరుగుల దూరంలో నిలిచింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, శివం దూబే 2 వికెట్లు తీశారు

