Today top news in telugu by bikki news

Today top news in Telugu March 30th 2026 – నేటి ప్రధాన వార్తలు

BIKKI NEWS : Today top news in Telugu March 30th 2026 – నేటి ప్రధాన వార్తలు

Today top news in Telugu March 30th 2026

Today Telangana News

తల్లిదండ్రుల సంరక్షణ బిల్లు: వృద్ధులైన తల్లిదండ్రులను పిల్లలు విస్మరిస్తే, వారి వేతనాల నుండి కొంత మొత్తాన్ని కట్ చేసి తల్లిదండ్రుల పోషణకు ఇచ్చే కీలక బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

జర్నలిస్టుల అక్రిడిటేషన్: అక్రిడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ఏప్రిల్ 6 వరకు నిర్ణయించినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ ప్రకటించింది.

మున్సిపల్ బడ్జెట్ 2026-27: జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలోని తూర్పు మరియు మధ్య మండలాల మున్సిపల్ కార్పొరేషన్లు తమ వార్షిక బడ్జెట్‌లను సమర్పించాయి.

ధరణి అప్లికేషన్ల పరిష్కారం: ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

కంటోన్మెంట్ విలీనం: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే ప్రక్రియపై ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది

రాష్ట్రవ్యాప్త వర్ష సూచన: ఉత్తర, పశ్చిమ మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో నేడు (మార్చి 30), రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది

Today Andhra Pradesh News

2.5 లక్షల ఇళ్ల పంపిణీ: ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించిన 2.5 లక్షల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు నేడు ప్రారంభించనున్నారు.

అమరావతి రాజధాని తీర్మానం: అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా గుర్తిస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన చారిత్రాత్మక తీర్మానాన్ని చట్టబద్ధం చేయాలని కేంద్ర హోం శాఖకు ప్రభుత్వం నివేదిక పంపింది.

మూలపేట పోర్టు వివాదం: మూలపేట పోర్టు నిర్మాణ ఘనతను ప్రస్తుత ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటోందని ఆరోపిస్తూ వైసీపీ నేతలు నేడు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

ఐఏఎస్ అధికారుల బదిలీ: ఏపీలో పరిపాలనా సంస్కరణల్లో భాగంగా పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఏపీఈడీబీ (APEDB) కొత్త సీఈఓగా షాన్ మోహన్ బాధ్యతలు చేపట్టారు.

శ్రీవారి దర్శనం: తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబు సాధారణ భక్తుడిలా క్యూలైన్లో వెళ్లి దర్శించుకున్నారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులతో సమీక్షించారు.

పోలవరం డయాఫ్రమ్ వాల్: మే నెలలోగా పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని జలవనరుల శాఖకు ప్రభుత్వం డెడ్‌లైన్ విధించింది

Today National News

మన్‌ కీ బాత్‌: 132వ ఎపిసోడ్ ద్వారా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. పశ్చిమాసియా సంక్షోభం దృష్ట్యా ఇంధన పొదుపు అవసరమని, స్వదేశీ తయారీ రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతిని కొనియాడారు.

కువైట్ దాడిలో భారత కార్మికుడు మృతి: కువైట్‌లోని పవర్ మరియు వాటర్ ప్లాంట్‌పై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఒక భారతీయ కార్మికుడు మరణించినట్లు విదేశాంగ శాఖ ధృవీకరించింది.

హార్ముజ్ జలసంధి భద్రత: రెండు భారతీయ ఎల్పీజీ (LPG) నౌకలు హార్ముజ్ జలసంధిని క్షేమంగా దాటి భారత్ వైపు వస్తున్నాయని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తెలిపింది.

నార్త్ ఇండియాలో వర్షాలు: వెస్ట్రన్ డిస్టర్బెన్స్ కారణంగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో నేడు భారీ వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

యూసీసీ అమలు: అస్సాంలో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) అమలుకు రంగం సిద్ధమైందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు

పీఎం-కుసుమ్ 2.0: వ్యవసాయ పంపుసెట్ల సోలరైజేషన్ పథకం ‘పీఎం-కుసుమ్’ గడువును పెంచుతూ, బ్యాటరీ స్టోరేజ్ సౌకర్యాన్ని కూడా ఇందులో చేర్చాలని కేంద్రం నిర్ణయించింది

Also Read…

తాజా విద్యా సమాచారం
తాజా జాబ్ నోటిఫికేషన్స్
ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
కరెంట్ అఫైర్స్
జీకే బిట్స్
ఎంప్లాయిస్ న్యూస్

Today International News

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: అమెరికా సైన్యం ఇరాన్ పై గ్రౌండ్ ఆపరేషన్లకు కుట్ర పన్నుతోందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ ఆరోపించారు.

లెబనాన్‌లో శాంతిభద్రతలు: దక్షిణ లెబనాన్‌లో జరిగిన పేలుడులో ఒక ఐక్యరాజ్యసమితి (UNIFIL) శాంతి పరిరక్షక సైనికుడు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ నిరోధం: ఫ్లోరిడాలో ప్రధాని ట్రంప్ ప్రయాణించాల్సిన ఎయిర్ ఫోర్స్ వన్ విమాన మార్గంలో ఒక ప్రైవేట్ విమానం రావడంతో ఎఫ్-16 యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి.

పోప్ లీయో XIV విజ్ఞప్తి: యుద్ధం చేసే వారి ప్రార్థనలను దేవుడు వినడని, తక్షణమే పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పాలని పోప్ పిలుపునిచ్చారు.

ఆస్ట్రేలియా ఉచిత రవాణా: ఇంధన ధరల పెరుగుదల వల్ల సామాన్యులకు ఊరటనిచ్చేందుకు ఆస్ట్రేలియాలోని రెండు రాష్ట్రాలు ఉచిత పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ప్రకటించాయి.

పాకిస్థాన్ ప్రాంతీయ భేటీ: ఇరాన్ యుద్ధాన్ని ముగించే దిశగా చర్చలు జరిపేందుకు సౌదీ అరేబియా, టర్కీ ప్రతినిధులతో పాకిస్థాన్ సమావేశమైంది.

Today Business News

Stock Market : నేటి స్టాక్ మార్కెట్ అంచనాలు‌ మరియు నిపుణుల విశ్లేషణ కోసం క్లిక్ చేయండి.

Gold Rate : నేటి బంగారం వెండి ప్లాటినం ధరలు మరియు డాలర్ తో రూపాయి మారకం విలువ కోసం క్లిక్ చేయండి

ఏప్రిల్ 1 నుండి మార్పులు: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్యాస్ ధరలు, పన్ను నిబంధనలు మరియు బ్యాంకింగ్ చార్జీలలో మార్పులు రానున్నాయి.

ఎయిర్ ఇండియా జీసీసీ సర్వీసులు: పశ్చిమాసియాలోని భారతీయ ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నేడు (మార్చి 30) 20 ప్రత్యేక విమానాలను నడుపుతున్నాయి.

Today Sports News

IPL ముంబై ఇండియన్స్ విజయం: ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు

IPL today match : లక్నో సూపర్ జెయింట్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య నేడు కీలక పోరు జరగనుంది.

క్యాండిడేట్స్ చెస్: యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద తొలి రౌండ్‌లో అనీష్ గిరిపై అద్భుత విజయం సాధించి టోర్నీని ఘనంగా ప్రారంభించాడు.

ఇండియన్ ఓపెన్ గోల్ఫ్: అలెక్స్ ఫిట్జ్‌పాట్రిక్ 2026 ఇండియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

పారా బాడ్మింటన్: స్పానిష్ పారా బాడ్మింటన్ టోర్నీలో ప్రమోద్ భగత్ ఒక స్వర్ణం, రెండు రజత పతకాలు సాధించాడు.

Today Education & Jobs

జేఈఈ మెయిన్ సెషన్-2 అడ్మిట్ కార్డ్: ఏప్రిల్ 2 మరియు 4వ తేదీల్లో పరీక్ష రాయబోయే అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. Click

Free Training : యాదాద్రి జిల్లాలో ఉన్న శ్రీరామానంద తీర్థం గ్రామీణ సంస్థ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వనుంది

OU JOB MELA – మార్చి 31న ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు

TOSS SSC, INTER EXAMS SCHEDULE విడుదల చేసింది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →