SCHOLARSHIP – స్కాలర్షిప్ గడువు పెంపు

TELANGANA POST METRIC SCHOLARSHIP 2025 DATE EXTENDED

BIKKI NEWS (JAN. 01) : TELANGANA POST METRIC SCHOLARSHIP 2025 DATE EXTENDED. తెలంగాణ రాష్ట్రంలోని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువును 2026 మార్చి 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 31 తో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ల దరఖాస్తు గడవు ముగిసింది.

TELANGANA POST METRIC SCHOLARSHIP 2025 DATE EXTENDED

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ కొరకు మార్చి 31 వరకు అవకాశం కలదు.

పదవ తరగతి పాసై ఆపై చదువులు ఇంటర్మీడియట్ , డిగ్రీ , పీజీ, బీటెక్, ఎంటెక్ , ఎంబీబీఎస్, నర్సింగ్ , బీ ఫార్మసీ , ఫార్మా డీ వంటి తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

రాష్ట్రవ్యాప్తంగా 10.89 లక్షల మంది విద్యార్థులు పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ కోసం అర్హులు కాగా, కేవలం 7.82 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్నారు.

వెబ్సైట్ : https://telanganaepass.cgg.gov.in/
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK