BIKKI NEWS (MAY 03) : Telangana employees Unions withdrew protest programmes. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాలు చేపట్టబోయే నిరసన కార్యక్రమాలను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డితో జరిగిన భేటి అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Telangana employees Unions withdrew protest programmes.
ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ సందర్భంగా తక్షణమే పీఆర్సీ నివేదిక తెప్పించుకుని అమలు చేస్తామని, పెండింగ్ బిల్లుల చెల్లింపుకు 100 రోజుల్లో 6 వేల కోట్లు చెల్లిస్తామని, జూన్ 1 వరకు ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారి చేస్తామని ప్రధాన డిమాండ్లను పరిష్కారానికి అంగీకారం తెలపడంతో ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమాలను విరమించుకున్నట్లు సమాచారం.

