హైదరాబాద్ (ఏప్రిల్ 17):Telangana Employees Protest on April 17th. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్లు తమ దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టారు. తెలంగాణ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. సచివాలయం మొదలుకొని మండల స్థాయి కార్యాలయాల వరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో భారీ ప్రదర్శనలు చేపట్టారు.
Telangana Employees Protest on April 17th
ప్రధాన డిమాండ్లు ఇవే: (Key Demands of TGEJAC)
ఉద్యోగ సంఘాల నేతలు ప్రధానంగా 4 డిమాండ్లతో పాటు మొత్తం 64 అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు:
- 2వ పీఆర్సీ (PRC) అమలు: గత 30 నెలలుగా పెండింగ్లో ఉన్న 2వ పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని, 51% ఫిట్మెంట్తో జూన్ 2 (తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) నాటికి అమలు చేయాలి.
- పెండింగ్ బిల్లుల విడుదల: సుమారు రూ. 13,000 కోట్ల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలి. నెలవారీ ఇచ్చే అరకొర నిధులు ఉద్యోగుల అవసరాలకు సరిపోవడం లేదని జేఏసీ మండిపడింది.
- నగదు రహిత వైద్యం (EHS): ఉద్యోగులు, పెన్షనర్ల కోసం కొత్త Employees Health Scheme (EHS) విధానాన్ని తక్షణమే అమలులోకి తీసుకురావాలి. కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత చికిత్స అందేలా చూడాలి.
- సీపీఎస్ (CPS) రద్దు – ఓపీఎస్ (OPS) పునరుద్ధరణ: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ను పూర్తిగా రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలి. ముఖ్యంగా 01/09/2004 కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకమైన వారికి పాత పెన్షన్ వర్తింపజేయాలి.
రాష్ట్రవ్యాప్తంగా హోరెత్తిన నిరసనలు
హైదరాబాద్లోని సచివాలయం, కలెక్టరేట్, బీమా భవన్ (PAO Office) వద్ద ఉద్యోగులు భారీ ఎత్తున నిరసన తెలిపారు. టీజీఈజేఏసీ ఛైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో జాప్యం చేస్తోందని విమర్శించారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించని పక్షంలో తదుపరి ఉధృత కార్యాచరణ ఉంటుందని హెచ్చరించారు.
ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, పెండింగ్ డీఏ (DA)లు, బదిలీలు మరియు ఇతర 64 డిమాండ్లను పరిష్కరించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కో-ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, కార్యదర్శులు మరియు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు

