BIKKI NEWS (JAN. 09) : Telangana employees DA go released soon with 3.64%. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ లో ఉన్న డీఏ లలో ఒక డీఏ రెండు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది.
Telangana employees DA go released soon with 3.64%
DA దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఆమోదం పొందిన వెంటనే డీఏ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఈసారి విడుదల చేసే డీఏ 3.64% గా ఉండనుంది.
ఇప్పుడు విడుదల చేసే డీఏ 2023 జూలై నెలకు సంబంధించినది. దీంతో 2023 జూలై నుంచి డీఏ బకాయిలను ఏరియర్స్ ను వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం ఉంది.
అయితే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల అయితే డీఏ ఉత్తర్వుల విడుదల వాయిదా పడే అవకాశం ఉంది.
జనవరి 2026 తో కలిపి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం 6 డీఏ లు పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

