BIKKI NEWS (DEC. 28) : POST METRIC SCHOLARSHIP 2025 DATE EXTENSION. తెలంగాణ రాష్ట్రంలోని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువును 2026 జనవరి 31 వరకు పొడిగించాలని సంక్షేమ శాఖలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి.
POST METRIC SCHOLARSHIP 2025 DATE EXTENSION
షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 31 తో పోస్టుమట్రిక్ స్కాలర్షిప్ల దరఖాస్తు గడవు ముగియనుంది.
పదవ తరగతి పాసై ఆపై చదువులు చదువుతున్న విద్యార్థులు ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
రాష్ట్రవ్యాప్తంగా 12.5 లక్షల మంది విద్యార్థులు పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ కోసం అర్హులు కాగా, కేవలం 7.5 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇంకా 5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవలసి ఉంది.
ఈ నేపథ్యంలో సంక్షేమ శాఖ అధికారులు ప్రభుత్వానికి దరఖాస్తు గడవు పెంచాలని ప్రతిపాదనలు పంపారు. దీనిపై సానుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
విద్యార్థులకు కళాశాల యజమాన్యాలే ఈ స్కాలర్షిప్ పై అవగాహన కల్పించి, దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయించాల్సిన బాధ్యత తీసుకోవాలని రాతపూర్వకంగా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
వెబ్సైట్ : https://telanganaepass.cgg.gov.in/
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
