TEACHERS – విద్యార్థుల పదో తరగతి మార్కుల ఆధారంగా టీచర్లకు గ్రేడ్స్

BIKKI NEWS (DEC. 02) : Grading for teachers According to students 10th class marks. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ టీచర్లకు గ్రేడింగ్ విధానం అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యార్థుల సరాసరి మార్కుల ఆధారంగా సబ్జెక్టు టీచర్లకు గ్రేడ్లు ఇవ్వనున్నట్లు ఏపీ పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది.

Grading for teachers According to students 10th class marks

ఉపాధ్యాయుల అవార్డులకు సైతం విద్యార్థుల పదో తరగతి మార్కులను ప్రాతిపదికగా తీసుకోనున్నారు.

పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్ డ్యూటీలను రాష్ట్ర స్థాయి నుంచే కేటాయించనున్నారు.

జవాబు పత్రాల మూల్యాంకనం కూడా రాష్ట్ర స్థాయి కార్యాలయం నుంచే ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు.

డిసెంబర్ 15 తర్వాత పదో తరగతి విద్యార్థులెవ్వర్నీ ఇతర కార్యకలాపాలకు వినియోగించకూడదు.

ప్రతిరోజూ వారికి పరీక్ష నిర్వహించి, మార్కులను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి. ప్రతిరోజూ నిర్వహించే స్లిప్ టెస్ట్ సమాధానపత్రాలను పబ్లిక్ పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రధానోపాధ్యాయులు భద్రపరచాలి.

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK