1803 Pet Posts Will Sanction In Schools. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ హైస్కూల్ లలో 1,803 మంది పీఈటీలు అవసరమని పాఠశాల విద్యాశాఖ. తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.
1803 Pet Posts Will Sanction In Schools
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,701 హైస్కూళ్లు ఉండగా, వాటిల్లో 1,803 చోట్ల పీఈటీలు లేరని నివేదికలో వెల్లడించింది. (Job notifications)
అన్ని ఉన్నత పాఠశాలల్లో పీఈటీలను నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించాడు. ఈక్రమంలో ప్రాధమిక పాఠశాలల్లో ఎస్జీటీ పోస్టులు ఎక్కువగా ఉన్నందున వాటిని తగ్గించి, ఆ మేరకు కొత్తగా 1,803 పీఈటీ పోస్టులను మంజూరు చేయాలని అధికారులు కోరారు.
అంతేకాకుండా 260 ఉన్నత పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల పోస్టులు మంజూరు చేయలేదు. వాటికి కూడా ఎస్జీటీ పోస్టులను తగ్గించి, హెచ్ఎం పోస్టులను ఇవ్వాలని కోరారు..

