BIKKI NEWS (SEP. 11) : Telangana employees pending DAs updates. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డియాలలో మూడు డిఏలను తక్షణమే చెల్లించాలని ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.
Telangana employees pending DAs updates.
అయితే ప్రభుత్వం ఆర్థిక భారం నేపథ్యంలో కేవలం రెండు డిఏలు ఇవ్వడానికే సుముఖంగా ఉన్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఈ మేరకు ఆర్థిక శాఖ కసరత్తు చేసినట్లు సమాచారం.
తక్షణ రెండు డిఏలు మంజూరు చేసినా కూడా ఖజానా పై నెలకు 6000 కోట్ల భారం పడననున్నట్లు ప్రాథమిక అంచనాల ప్రకారం తేలినట్లు సమాచారం.
గురువారం ఉద్యోగ సంఘ జేఏసీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని పి ఆర్ సి, సిపిఎస్ అమలు, పెండింగ్ డీఏ లు, బిల్లులపై విన్నవించుకోగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సోమవారం నాడు అసెంబ్లీలో ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల అనంతరం పిఆర్సి నివేదిక తెప్పించుకొని ఉద్యోగ సంఘాలతో మరోసారి చర్చలు జరుపుతానని హామీ ఇచ్చినట్లు సమాచారం.
