BIKKI NEWS (MAR. 06) : Today top news in Telugu march 6th – నేటి ప్రధాన వార్తలు
Today top news in Telugu march 6th
Today Telangana News
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా. జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్ర కు బదిలీ.
also read : Who is Who – రాష్ట్రాల సీఎం, గవర్నర్ ల లిస్టు
నేటి నుండి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక 99 రోజుల కార్యక్రమం ప్రారంభం.
మండలం యూనిట్ గా యూరియా పంపిణీ చేయడానికి సీఎం ఆదేశాలు.
ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులను నిర్దేశిస్తూ జీవో నెంబర్ 6 ను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
Today A.P. News
ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలను కంటే… మూడో బిడ్డనుండి 25 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
28 కి చేరిన వేట్లపాలెం బాణాసంచా మృతుల సంఖ్య.
విజయవాడలో ఆశ వర్కర్ల మహా ధర్నా.
స్థానిక సంస్థలకు ముందే కొత్త జిల్లా పరిషత్తులు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు
Today National News
ఖమేనీ మృతి పై భారత్ సంతాపం తెలిపింది. భారత విదేశాంగ శాఖ మంత్రి ఇరాన్ విదేశాల మంత్రితో ఫోన్లో మాట్లాడారు.
భారత్ లో పర్యటిస్తున్న ఫీన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ప్రధానితో భేటీ ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు.
బీహార్ ముఖ్యమంత్రిగా బిజెపి అభ్యర్థి సామ్రాట్ చౌదరి పగ్గాలు చేపట్టే అవకాశం.
పశ్చిమ ఆసియాపై ప్రధాని మోడీ మౌనం దేశానికి ముప్పు అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
తెలంగాణ గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా, మహారాష్ట్ర గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ,బెంగాల్ గవర్నర్ గా ఆర్ ఎన్ రవి, కేరళ గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాధ్ ఆర్లేకర్ – తమిళనాడు గవర్నర్ గా అదనపు బాధ్యతలు.
Today International News
పశ్చిమ ఆసియాలోని పలు దేశాలపై అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేశాయి.
శక్తివంతమైన అణు క్షిపణిని పరీక్షించిన అమెరికా.
చైనా రక్షణ బడ్జెట్ 25.43 లక్షల కోట్లు
బ్రిట్ని స్పియర్ అరెస్ట్, విడుదల
Today Business News
గురువారం భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. నేటి స్టాక్ మార్కెట్ అంచనాల కోసం క్లిక్ చేయండి.
గురువారం తగ్గిన బంగారం వెండి ధరలు. నేటి బంగారం ధరలు ఇవే.
వివిధ దేశాల మీద విధించిన సుంకాల సొమ్మును వాపస్ చేయాలని అమెరికా కోర్టు ఆదేశించింది
Today Sports News
IND VS ENG – ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన రెండో సెమీఫైనల్ లో ఉత్కంఠభరితంగా ఇంగ్లాండ్ పై భారత్ విజయం సాధించి ఫైనల్ కు చేరింది .
ఆదివారం భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ t20 ప్రపంచ కప్ ఫైనల్ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.
భారత్ ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్ల మధ్య 18 నుండి ఏకైక టెస్ట్ ప్రారంభం కానుంది
Today Education and Job Updates
తెలంగాణ 10వ తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల
నేడు తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండియర్ మ్యాథ్స్ 2B, జువాలజీ, హిస్టరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

