BIKKI NEWS (DEC. 04) : West Bengal Teachers Case closed. పశ్చిమ బెంగాల్ లో 32 వేల మంది ఉపాధ్యాయ నియామకం కేసులో నియామకాలు రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. సింగిల్ బెంచ్ రద్దు చేసిన.. ఆ 32వేలమంది ప్రైమరీ టీచర్ల నియామకాలు చెల్లుతాయని పేర్కొంది.
West Bengal Teachers Case closed.
తొమ్మిదేళ్లుగా సర్వీసులో ఉన్న వారిని ఇప్పుడు తొలగిస్తే.. వారి కుటుంబాలపై ప్రతికూల ప్రభావం పడొచ్చని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
కేసు ఏంటంటే.?
2014 ఉపాధ్యాయ అర్హత పరీక్ష తర్వాత నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ జస్టిస్ గంగోపాధ్యాయ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ 2023లో 32వేల మంది ఉపాధ్యాయుల నియామకాలను రద్దు చేసింది. ఆ స్థానాలకు మూడు నెలల్లోపు కొత్త నియామక ప్రక్రియను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అనంతరం కేసును విచారించిన జస్టిస్ సుబ్రతా, జస్టిస్ సుప్రతిమ్ భట్టాచార్యలతో కూడిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఉత్తర్వుపై స్టే విధించింది. కొత్త నియామక ప్రక్రియను పూర్తి చేయడానికి రాష్ట్రానికి ఆరు నెలల అనుమతి ఇచ్చింది.
ఈ స్టేకు వ్యతిరేకంగా రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కేసు తుది విచారణ కోసం హైకోర్టుకు తిరిగి పంపింది. తాజాగా దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆ టీచర్ల నియామకాలు చెల్లుతాయని తీర్పునిచ్చింది.
- విద్యార్థులు దేశ రక్షణలో భాగస్వాములు కావాలి – రిటైర్డ్ కెప్టెన్ డాక్టర్ లింగాల పాండు రంగారెడ్డి
- CURRENT AFFAIRS 6th DECEMBER 2025 – కరెంట్ అఫైర్స్
- Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 06
- INTER VOC. EXAM TIME TABLE 2026.
- INTEREST RATES – రెపో రేట్ 25 బేసీస్ పాయింట్లు తగ్గింపు

