Tamilnadu assured pension scheme 2026.

OPS – తమిళనాడు లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు

BIKKI NEWS (JAN. 05) : TAMILNADU ASSURED PENSION SCHEME 2026. తమిళనాడు హామీ పింఛను పథకం TN APS 2026 ను ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రకటించారు.

TAMILNADU ASSURED PENSION SCHEME 2026.

ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కు పాత పింఛను పథకానికి సమానమైన ప్రయోజనాలు అందించేలా రూపొందించబడిందని తెలిపారు.

TN APS 2026 GUIDELINES

  • రిటైర్మెంట్ తర్వాత తమ చివరి డ్రా చేసిన బేసిక్ పేలో 50 శాతం హామీ పింఛనుగా ఉద్యోగులు పొందుతారు.

  • తమ బేసిక్ పేలో 10 శాతం పింఛను ఫండ్ కు ఉద్యోగులు కాంట్రిబ్యూట్ చేయాలి. హామీ పింఛను అందించడానికి అవసరమైన అదనపు నిధులను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.

  • పింఛనర్లకు ప్రతి ఆరు నెలలకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు ఇవ్వబడుతుంది, ఇది ప్రస్తుత ఉద్యోగులకు ఇచ్చే డీఏ పెంపుతో సమానంగా ఉంటుంది.

  • పెన్షనర్ మరణించినట్లయితే, వారి నామినీకి 60 శాతం పింఛను ఫ్యామిలీ పింఛనుగా అందుతుంది.

  • సర్వీస్ సమయంలో లేదా రిటైర్మెంట్ సమయంలో మరణించినట్లయితే, సర్వీస్ కాలం ఆధారంగా గరిష్టంగా రూ.25 లక్షల వరకు డెత్ గ్రాట్యుటీ అందుతుంది.

  • పథకం అమలుకు ముందు కాంట్రిబ్యూటరీ పింఛను పథకం కింద చేరిన, పింఛను లేకుండా రిటైర్ అయిన ఉద్యోగులకు ప్రత్యేక కరుణ పింఛను అందించబడుతుంది.

  • పథకం అమలుతో ఒక్క సారి రూ.13,000 కోట్లు, ప్రతి సంవత్సరం సుమారు రూ.11,000 కోట్లు (జీతాల పెంపుతో పాటు పెరిగేలా) అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →