BIKKI NEWS (AUG.31) : Pension vidroha dinam on September 1st. సెప్టెంబర్ 1న తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ జేఏసీ పెన్షన్ ఉద్రోహ దినంగా నిర్వహించాలని నిలనిర్ణయం తీసుకుంది మ. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు TGEJAC పిలుపునిచ్చింది.
Pension vidroha dinam on September 1st
పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చేపట్టనుంది.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీముని తొలగించి పాత పెన్షన్ పద్ధతిని ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి ఈ సందర్భంగా నిరసన రూపంలో తెలియజేయనుంది.
అలాగే సెప్టెంబర్ 8 నుండి జిల్లాలకు ఉద్యోగులు జేఏసీ బస్సు యాత్రలు చేపట్టనుంది. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో అనేక ఉద్యోగ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణను బలోపేతం చేయనుంది.
చివరిగా అక్టోబర్ 12న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అక్టోబర్ 12న 33 జిల్లాల నుండి లక్షలాదిగా ఉద్యోగులు చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలిరావాలని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

