టెట్ అర్హత లేని టీచర్లు 45,742 - bikki news

టెట్ అర్హత లేని టీచర్లు 45,742

BIKKI NEWS (OCT. 09) : NO TET ELIGIBILITY TEACHERS ARE 45742. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ లెక్కల ప్రకారం టెట్ అర్హత లేని మొత్తం టీచర్లు 45,742 మంది ఉన్నారు.

NO TET ELIGIBILITY TEACHERS ARE 45742.

సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రస్తుతం పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు 2027 ఆగస్టు 30వ తేదీ నాటికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరని తీర్పు వెలువరించింది.

రాష్ట్రంలో దాదాపు 1.15 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. పెద్దసంఖ్యలో టీచర్లకు టెట్ లేకపోవడం.. రెండేళ్లే గడువు ఉన్న నేపధ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని, అందుకు అనుమతి ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదించింది.

అయితే అడ్వొకేట్ జనరల్ అభిప్రాయం తీసుకొని తమకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం తాజాగా ఆదేశించింది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →