TET – టీచర్లకు టెట్ మినహాయింపు కుదరదు – NCTE

BIKKI NEWS (OCT. 21) : NCTE DECLARED TET COMPULSORY FOR TEACHERS. ప్రభుత్వ టీచర్లకు టెట్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాల్సిందేనని ఎన్‌సీటీఈ స్పష్టం చేసింది.

NCTE DECLARED TET COMPULSORY FOR TEACHERS

2017 కు ముందు టీచరు ఉద్యోగం పొందిన టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలని పలు సంఘాలు NCTEని కోరగా మినహాయింపు కుదరదని స్పష్టం చేసింది.

2017లో పార్లమెంట్ ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అని తీర్మానం చేసింది. దాని మేరకు సుప్రీంకోర్టులో పలు పిటిషన్ ల నేపద్యంలో తాజాగా సుప్రీంకోర్టు కూడా టీచర్లకు టెట్ తప్పనిసరి అంటూ తీర్పునిచ్చింది.

ఐదు సంవత్సరాల సర్వీస్ ఉన్నవారికి మాత్రమే టెట్ మినహాయింపు ఉంటుందని, ఈ తీర్పులో పేర్కొంది. కానీ వారికి ఎలాంటి పదోన్నతలు లభించవని కూడా తీర్పు చెప్పింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా లక్ష మందికి పైగా టీచర్లు టెట్ అర్హత లేకుండానే సర్వీస్ లో ఉన్నారు‌. వీరు రెండు సంవత్సరాలలో టెట్ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. లేకుంటే వీరిని సర్వీస్ నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయి.

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK