- BIKKI NEWS : 12 JAN. 2026
DA RELEASED BY CM REVANTH REDDY. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులకు సంక్రాంతి సందర్భంగా ఒక్క డిఎను విడుదల చేశారు. 3.64% తో కూడిన 2023 జూలై నెలకు సంబంధించిన డీఏ కు ఈరోజు ఆమోదం తెలిపానని తెలిపారు.
DA RELEASED BY CM REVANTH REDDY
టీజీవోస్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15.5 లక్షల ఉద్యోగులు ఇన్ని రోజులు పెండింగ్ బిల్లులు చెల్లించకున్న ఓపికగా పని చేశారని గుర్తు చేశారు.

వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు నిధులను పెంచుతానని స్పష్టం చేశారు
ఈ సందర్భంగా టి.జి.ఓస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బి శ్యామ్ లు ముఖ్యమంత్రి దృష్టికి పెండింగ్ డీఏలు, హెల్త్ కార్డులు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు, హెల్త్ కార్డులు, టీజిఓస్ భవనాలకు నిధులు వంటి అంశాల మీద ముఖ్యమంత్రి కి సభాముఖంగా విన్నపం చేశారు.

