BIKKI NEWS (DEC. 13) : COMPASSIONATE APPOINTMENT EMPLOYEES ARE NOT ELIGIBLE TO PROMOTIONS. ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే అర్హత కలిగిన అతని వారసుడు హక్కుగా ఉద్యోగం పొందే వీలు లేదని సుప్రీంకోర్టు స్పష్టం తాజాగా చేసింది.
COMPASSIONATE APPOINTMENT EMPLOYEES ARE NOT ELIGIBLE TO PROMOTIONS.
అసాధారణ పరిస్థితుల్లో జరిగే కారుణ్య నియామకాన్ని ఆధారం చేసుకొని ఉద్యోగం పొందినవారు సీనియారిటీ కలిగి వున్నామంటూ పదోన్నతి కోరే వీలు లేదని కూడా జస్టిస్ రాజేశ్ బిందల్, జస్టిస్ మన్మోహన్ తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
మానవత్వ ప్రాతిపదికన జరిగే కారుణ్య నియామకాన్ని ఒక మినహాయింపుగానే పరిగణించాలని, అలాంటి నియామకాన్ని నిబంధనగా భావించరాదని తెలిపింది.
కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం పొందిన ఇద్దరు స్వీపర్లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాలన్న మద్రాసు హైకోర్టు ఆదేశాల్ని సవాలుచేస్తూ దాఖలైన వ్యాజ్యంపై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

