Rationalization of teachers in telangana.

RATIONALIZATION – టీచర్ల హేతుబద్ధీకరణకు సీఎం పచ్చజెండా

BIKKI NEWS (JAN. 09) : Rationalization of teachers in Telangana. టీచర్ల హేతుబద్ధీకరణకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విద్యాశాఖ పై జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

Rationalization of teachers in Telangana.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ చొప్పున ఉండాల్సి ఉండగా, ప్రతి 17 మంది విద్యార్థులకు ఒక టీచర్ చొప్పున ఉన్నట్లు సీఎం అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

దీంతో మిగిలిన టీచర్ల సేవలను వివిధ రూపాలలో వాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది.

విద్యార్థులు తక్కువ ఉన్న పాఠశాలల నుండి టీచర్లను విద్యార్థులు ఎక్కువ ఉన్న పాఠశాలలకు హేతుబద్ధీకరణ చేసే అవకాశం దీని ద్వారా లభిస్తుంది. చివరిసారిగా 2015లో టీచర్ల హేతుబద్ధీకరణ జరిగిన సంగతి తెలిసిందే.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →