BIKKI NEWS (MAY 02) : Telangana Employees JAC will meet CM today at 3 PM. తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు నేడు సీఎం రేవంత్ రెడ్డితో సాయంత్రం 3.00 గంటలకు భేటీ కానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉద్యోగ సంఘ నాయకులకు సమాచారం సీఎం కార్యాలయం నుండి అందినట్లు సమాచారం.
Telangana Employees JAC will meet CM today at 3 PM.
నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయిన ఉద్యోగ సంఘ నాయకులు మ. ప్రధానంగా సీఎంతో భేటీ నిర్వహించాలని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు సీఎం ఉద్యోగ సంఘ నాయకులతో భేటీ కావడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పిఆర్సీ, పెండింగ్ బకాయిలు, ఓల్డ్ పెన్షన్, 317 బాధిత ఉద్యోగుల సమస్యలు, ఉద్యోగుల బకాయిలు, ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు వంటి అంశాలను ప్రధానంగా ఉద్యోగ సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
వీటి మీద సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో నేడు చర్చల అనంతరం తేలనుంది.
మే 5వ తారీఖున సామూహిక నిరాహార దీక్షలకు ఉద్యోగ సంఘ నాయకులు ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే

