Employees transfers go 2026 - బదిలీలపై నిషేధం ఎత్తివేత - మార్గదర్శకాలు - bikki news

EMPLOYEES TRANSFERS GO 2026 – బదిలీలపై నిషేధం ఎత్తివేత – మార్గదర్శకాలు

BIKKI NEWS (APRIL 21) : Telangana employees transfers GO and guidelines 2026. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీల (Transfers) ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు బదిలీల నిబంధనలు మరియు కాలపట్టికను వివరిస్తూ జీవో నెంబర్ 38 ను జారీ చేసింది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, కౌన్సిలింగ్ పద్ధతిలో ఈ బదిలీలు జరగనున్నాయి.

Telangana employees transfers GO and guidelines 2026

బదిలీల షెడ్యూల్ (Schedule):

​ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, బదిలీల ప్రక్రియ మే 1 నుండి మే 31 వరకు కొనసాగుతుంది. జూన్ 1వ తేదీ నుండి బదిలీ అయిన ఉద్యోగులు కొత్త స్థానాల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది.

బదిలీలకు అర్హతలు మరియు నిబంధనలు:

  • కనీస సర్వీసు: ప్రస్తుత పని ప్రదేశంలో మూడు ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. (స్పౌజ్ ఉద్యోగులకు కనీస సర్వీస్ నిబంధన లేదు.)
  • గరిష్ట సర్వీసు: ఒకే ప్రాంతంలో నాలుగేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేస్తారు.
  • కట్ ఆఫ్ డేట్: సర్వీసు గణన కోసం 01-01-2026 ని ప్రామాణికంగా తీసుకుంటారు.

ఎవరికి ప్రాధాన్యత (Priority Criteria)?

​బదిలీల ప్రక్రియలో ప్రభుత్వం కొన్ని వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించింది:

  1. వైకల్యం: 70% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఉద్యోగులు.
  2. అనారోగ్య కారణాలు: క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, కిడ్నీ మార్పిడి వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
  3. వితంతువులు/ఒంటరి మహిళలు: మానవతా దృక్పథంతో వీరికి ప్రాధాన్యత ఇస్తారు.
  4. మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్: ఇద్దరు ఉద్యోగులు పరస్పర అంగీకారంతో బదిలీ కోరుకుంటే నిబంధనల మేరకు పరిశీలిస్తారు.
  5. దంపతుల బదిలీ (Spouse Case): భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
  6. 31-05-2027 వరకు పదవి విరమణ పొందే వారు బదిలీ ఐచ్ఛికం
  7. మానసిక అనారోగ్యం ఉన్న పిల్లల ఉద్యోగులకు బదిలీలలో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది
  8. ఫోకల్ – నాన్ ఫోకల్ నిబంధన పాటించాలి.
  9. కఠిన పరిసరాల్లో పని చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలి.

పారదర్శక విధానం:

  • ​బదిలీలన్నీ వెబ్ కౌన్సిలింగ్ లేదా పర్సనల్ కౌన్సిలింగ్ ద్వారానే నిర్వహించాలి.
  • ​ఖాళీల జాబితాను ముందుగానే నోటీసు బోర్డు లేదా వెబ్‌సైట్‌లో ప్రదర్శించాలి.
  • ​ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా కేవలం మెరిట్ మరియు సీనియారిటీ ప్రాతిపదికన ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మినహాయింపులు:

​శాంతిభద్రతల దృష్ట్యా పోలీస్ శాఖకు, అలాగే ఎక్సైజ్, వాణిజ్య పన్నుల వంటి కొన్ని కీలక శాఖలకు ప్రత్యేక నిబంధనలు అమలులో ఉంటాయి. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి విద్యాశాఖ విడిగా మార్గదర్శకాలు విడుదల చేయనుంది.

​ఈ బదిలీల వల్ల పరిపాలనలో మరింత వేగం పెరుగుతుందని, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →