Today in history – చరిత్రలో ఈరోజు నవంబర్ 12

Today in history - చరిత్రలో ఈరోజు నవంబర్ 12 - bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు నవంబర్ 12

Today in history November 12th

దినోత్సవం

  • జాతీయ కుటుంబ సౌహార్థ దినోత్సవం
  • ప్రపంచ న్యూమోనియా అవగాహన దినోత్సవం

సంఘటనలు

1766: సలాబత్‌ జంగును అతని సోదరుడు నిజాం ఆలీ ఖాను కూలదోసి, రాజమండ్రిని, శ్రీకాకుళాన్ని హసన్‌ ఆలీ ఖానుకు లీజు కిచ్చాడు. రాబర్టు క్లైవు మొగలు చక్రవర్తి షా ఆలంతో సంప్రదించి, ఉత్తర సర్కారులను ఈస్ట్‌ ఇండియా కంపెనీకి ధారాదత్తం చేసినట్లుగా ఆగస్టు 1765లో ఫర్మానా తెప్పించాడు. కాని దానిని మార్చి 1766 వరకు రహస్యంగా ఉంచాడు. బ్రిటిషు వారు కొండపల్లి దుర్గాన్ని ఆక్రమించారు. అవసరమైతే సైనిక చర్య చేపట్టడానికై జనరలు సిల్లాడ్‌ను మచిలీపట్నం పంపించారు. నిజాము కూడా శీఘ్రంగా యుద్ధ సన్నాహాలు చేసాడు. నవంబర్‌ 12, 1766 న కుదిరిన ఒక ఒప్పందం వలన యుద్ధం తప్పింది. ఉత్తర సర్కారులకు ప్రతిఫలంగా, కంపెనీ, నిజాము సహాయార్థం సైన్యాన్ని పోషిస్తుంది తూర్పు గోదావరి జిల్లా చరిత్ర
1969: రాష్ట్రపతి ఎన్నికలో స్వంత పార్టీ యొక్క అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా వి.వి.గిరిని గెలిపించిన ఇందిరా గాంధీని పార్టీ నుండి బహిష్కరించగా, కొత్తపార్టీ, కాంగ్రెస్ (ఐ) ని ఏర్పాటు చేసింది. తరువాతి కాలంలో ఇదే భారత జాతీయ కాంగ్రెసుగా గుర్తింపు పొందింది.
1996: హర్యానా లోని భివాని వద్ద ఆకాశంలో రెండు విమానాలు ఢీకొన్న ఘోర దుర్ఘటనలో 350 మంది మరణించారు.

జననాలు

1885: కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, తెలుగు సాహిత్య అవధానంలో పేరొందిన జంట సోదర కవులు. (మ.1932])
1920: పెరుగు శివారెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని నేత్రవైద్య నిపుణుడు., ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సలహాదారుగా, దేశ ప్రథమ పౌరుడి (రాష్ట్రపతి) కి గౌరవ నేత్ర చికిత్సకులుగా నియమితులయ్యారు,
1925: పసుమర్తి కృష్ణమూర్తి, చలనచిత్ర నృత్యదర్శకుడు. (మ.2004)
1929: సి.వి.సుబ్బన్న, శతావధాని (మ.2017)
1940: అంజాద్ ఖాన్, భారతీయ నటుడు, దర్శకుడు, (మ1992)
1977: ప్రియాంక త్రివేది, కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, చిత్రాల నటి.
1985: సనంశెట్టి, మోడల్, తమిళ, తెలుగు, మలయాళ నటి
1992:ప్రియాంక జవాల్కర్, తెలుగు సినీ నటి.

మరణాలు

1946: మదన్ మోహన్ మాలవ్యా, భారత స్వాతంత్ర్యయోధుడు. (జ.1861)
1986: భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా, భారతదేశ సుప్రీంకోర్టు ఆరవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1899)
1994: విల్మా రుడాల్ఫ్, ఒకే ఒలింపిక్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించిన మొదటి అమెరికన్ మహిళ. (జ.1940)
2012: చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు, స్వాతంత్ర్యసమరయోధులు. 1800 ఎకరాలు దానం చేసిన దాత
2018: అనంతకుమార్, కేంద్ర మంత్రి, కేన్సరు కారణంగా చనిపోయారు. (జ.1959).
2020: ఏడిద గోపాలరావు, ఆకాశవాణి కళాకారుడు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience to deliver real time updates on educational, job notifications, current affairs, GK BITS, stock market, online tests for study purpose.

View all posts by Saheb Shaik →