- BIKKI NEWS : 16-01-2026
Telangana Employees issues will be resolved soon. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.
Telangana Employees issues will be resolved soon.
ఈరోజు పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురంలో జరిగిన సమావేశంలో ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై స్పందించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు.
గత రెండు సంవత్సరాలుగా ఉద్యోగులు ఓపికతో ఉన్నారని ఇంకొంచెం ఓపిక పడితే త్వరలోనే ఉద్యోగుల పెండింగ్ సమస్యలన్నీ న్యాయపరంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
ఉద్యోగులు పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, త్వరలోనే న్యాయపరమైన సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని తెలిపారు.

