BIKKI NEWS (DEC. 17) : Junior and degree lectures also participate in BADI BAATA. వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అడ్మిషన్ల కొరకు ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల లెక్చరర్లు కూడా బడి బాట పట్టేలా విద్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.
Junior and degree lectures also participate in BADI BAATA
ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా మౌఖిక ఆదేశాలు తాజాగా జారీ చేశారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరియు డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న జూనియర్ మరియు డిగ్రీ లెక్చరర్లు కూడా బడిబాట పట్టడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెంచాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం.

