INDIA WON AGAINST PAKISTAN – భారత్ కి శివరాత్రి పాక్ కి కాళరాత్రి

India won against pakistan - భారత్ కి శివరాత్రి పాక్ కి కాళరాత్రి - bikki news

BIKKI NEWS (FEB. 15) : INDIA WON AGAINST PAKISTAN IN ICC T20 WORLD CUP. టీమిండియా పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది. ఐసీసీ t20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో 61 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది.

INDIA WON AGAINST PAKISTAN IN ICC T20 WORLD CUP

ఇది భారత్ కు వరుసగా ఈ టోర్నీలో మూడో విజయం. దీంతో భారత్ సూపర్ 8 కు చేరుకుంది.

శివరాత్రి వేళ టీమిండియా భారతీయులకు నిజమైన పండుగ వాతావరణాన్ని కల్పించింది. ఇది భారత్ కు శివరాత్రి కాగా పాకిస్తాన్ అభిమానులకు కాళరాత్రి గా మారింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టుకు ఇషాన్ కిషన్ (77) వీరబాదుడుతో టీమిండియా భారీ స్కోరును (175/7) సాధించింది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 32, దూబే – 27, తిలక్ వర్మ – 25 పరుగులతో రాణించారు.

అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన పాకిస్తాన్ జట్టుకు బూమ్ బూమ్ బుమ్రా గట్టి షాక్ ఇచ్చాడు. అనంతరం స్పిన్నర్ లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఏ సమయంలోనో పాకిస్తాన్ జట్టు పోటీలోకి రాలేదు. ఉస్మాన్ ఖాన్ (44) పరుగులతో మాత్రమే రాణించాడు.

భారత బౌలర్లలో బుమ్రా – 2, అక్షర్ పటేల్ – 2, వరుణ్ చక్రవర్తి – 2, పాండ్యా 2 వికెట్లతో రాణించారు.

ఐసిసి టి20 వరల్డ్ కప్ లలో భారత్ పాకిస్తాన్ జట్లు 9సార్లు తలపడగా భారత్ 8 సార్లు గెలిచి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →