BIKKI NEWS (DEC. 29) : Harish rao on Employees issues in Assembly. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు మాజీ మంత్రి హరీష్ రావు ఉద్యోగుల, రిటైర్డ్ ఉద్యోగులు, పోలీసుల సమస్యలపై గళమెత్తారు.
Harish rao on Employees issues in Assembly
ఉద్యోగులకు 6 డిఏలల వరకు పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని సభ దృష్టికి తెచ్చారు..
ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా ఇంకా పిఆర్సి అమలు చేయలేదని తక్షణమే అమలు చేయాలని పేర్కొన్నారు.
అలాగే ఉద్యోగులకు హెల్త్ కార్డులకు సంబంధించి తాము ఇచ్చిన జీవో అమలు చేయాలని తెలిపారు.
అలాగే పదవి విరమణ పొందిన 39 మంది బెనిఫిట్స్ అందక చనిపోయారని, చాలామంది బెనిఫిట్స్ కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారని వారికి వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు.
అలాగే పోలీస్ లకు సంబంధించి సరెండర్ లీవులు, టీఏ , డీఏ లు వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకువచ్చారు.

