- BIKKI NEWS : 13 JAN. 2026
Telangana government suspended 30 AEOs in paper leakage case. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒకేసారి 30 మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇన్ సర్వీస్ కోటా కింద బిఎస్సీ చదువుతన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ప్రశ్నా పత్రం లీకేజీలో దొరికిపోవడంతో సస్పెండ్ కు గురయ్యారు.
Telangana government suspended 30 AEOs in paper leakage case
జగిత్యాల, వరంగల్ , పాలెం, అశ్వరావుపేట, సిరిసిల్ల, రాజేంద్రనగర్, ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాలలో వీరు బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతూ సెమిస్టర్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రం లీకేజీ ద్వారా పరీక్షలు రాసినట్లు కమిటీ నిర్ధారించింది.
వీరు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పెన్నుల సహాయంతో పరీక్షలు రాసినట్లు గుర్తించి వీరి ప్రదేశాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం రద్దు చేసింది.
ఈ పేపర్ లీకేజీ అంశం పైన సిఐడి విచారణ చేపట్టినట్లు డిజిపి తెలిపారు.

