BIKKI NEWS (JAN. 03) : employees pending bills 6244 crores. తెలంగాణ రాష్ట్ర గత ప్రభుత్వం డిసెంబర్ 2023 నాటికి ₹40,154 కోట్ల విలువైన బిల్లులను పెండింగ్లో ఉంచిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇందులో ఉద్యోగస్తులకు సంబంధించిన బిల్లులు ₹4,575 కోట్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.
employees pending bills 6244 crores.
పెన్షనరీ బెనిఫిట్స్లో భాగంగా ఇప్పటివరకు ₹1,752 కోట్లు చెల్లించాం. ఇంకా చెల్లించాల్సిన మొత్తం ₹6,244 కోట్లుగా ఉందని ప్రకటించారు.
మిగిలిన పెన్షనరీ బెనిఫిట్స్ కోసం ప్రతి నెల రూ.700 కోట్లు క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.
అదేవిధంగా, ఉద్యోగస్తులకు ప్రతి నెల 1 వ తేదీనే జీతాలు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని తెలిపారు.
పెండింగ్ మెడికల్ బిల్లులు 200 కోట్లను పూర్తిగా చెల్లించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

