BIKKI NEWS (DEC. 23) : 17.651% DA ANNOUNCED FOR ELECTRICITY EMPLOYEES. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు డీఏను 17.651 శాతం ప్రతిపాదనలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆమోదం తెలిపారు.
17.651% DA ANNOUNCED FOR ELECTRICITY EMPLOYEES
డియర్నెస్ అలవెన్స్ (డీఏ) / డియర్నెస్ రిలీఫ్ (డీఆర్)పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా డీఏ పెంపుపై నిర్ణయం తీసుకున్నారు.
2025 జూలై 1 నుంచి పెంచిన డీఏ అమలు చేయనున్నారు. ఈ పెంపుతో విద్యుత్ సంస్థల పరిధిలో పనిచేస్తున్న 71,387 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు. పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.

