BIKKI NEWS (OCT. 29) : Union cabinet appointed 8th pay commission. కోటీ పదిహేను లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షన్ దారుల జీతాలు, పెన్షన్ లను పెంచేందుకు వీలుగా 8వ వేతన కమిషన్కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
Union cabinet appointed 8th pay commission
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజన దేశాయ్ ఈ 8వ వేతన సవరణ సంఘానికి ఛైర్ పర్సన్గా వ్యవహరించనున్నారు.
ప్రస్తుత 7వ వేతన సవరణ సంఘం కాలపరిమితి 2026తో ముగియనుంది. దీంతో 8వ పే కమిషన్ను ఏర్పాటు చేసింది.
ఈ కమిషన్లో ఛైర్పర్సన్, ఇద్దరు సభ్యులు ఉండనున్నారు. ఈ సంఘం 18 నెలల్లో సిఫార్సులు ఇవ్వనుందని కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది.

