Today top news in Telugu march 8th – నేటి ప్రధాన వార్తలు

Today top news in telugu march 8th - నేటి ప్రధాన వార్తలు - bikki news

BIKKI NEWS (MAR. 08) : Today top news in Telugu march 8th – నేటి ప్రధాన వార్తలు

Today top news in Telugu march 8th

Today Telangana News

బడ్జెట్ సమావేశాలు: ఈనెల 16 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు.

​పాత అసెంబ్లీ హాల్: వారసత్వ సంపదగా ఉన్న పాత అసెంబ్లీ హాలును పునరుద్ధరించి, నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీనిని ఇకపై శాసనమండలి కోసం ఉపయోగించనున్నారు.

​ఇందిరమ్మ ఇళ్లు: ఈ నెలాఖరులోగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

రైతు మేళా: రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో నేడు సీఎం రేవంత్ రెడ్డి ‘మెగా మహిళా రైతు మేళా’ను ప్రారంభించనున్నారు.

మంత్రులు రాజనర్సింహ, సీతక్క నేడు మహిళల కోసం ప్రత్యేక ‘హెల్త్ ప్రొఫైల్స్’ మరియు 10 ప్రాంతాల్లో ‘ఫీడింగ్ కియోస్క్‌లను’ ప్రారంభించనున్నారు

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ను 2025 ప్రకటించారు. పూర్తి విజేతలు లిస్టు

Today A.P. News

మహిళా సాధికారత: డ్వాక్రా ఉత్పత్తుల కోసం ‘స్వయం’ బ్రాండ్ పేరుతో లోగోలను సీఎం చంద్రబాబు నేడు ఆవిష్కరించనున్నారు.

​ తిరుమల లడ్డూ కేసులో డెయిరీ నిపుణుడు విజయభాస్కర రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

​రఘురామ కస్టడీ కేసు: రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో మాజీ ఏఎస్పీ సునీల్ నాయక్ విచారణ రెండో రోజు కొనసాగుతోంది.

​తీర ప్రాంత హెచ్చరిక: రానున్న 24 గంటల్లో దక్షిణ తీర ఆంధ్రలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండి (IMD) హెచ్చరించింది.

అమరావతిలో జరిగే మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొని 5 కొత్త పథకాలను ప్రారంభించనున్నారు.

Today National News

పెట్రోల్ ధరల భయం: మధ్యప్రాచ్యంలో యుద్ధం ముదిరితే భారత్‌లో పెట్రోల్ ధరలు రూ. 110 దాటవచ్చని నిపుణుల ఆందోళన.

పీఎం మోదీ భారీ ప్రాజెక్టులు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఢిల్లీలో ₹33,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో ఢిల్లీ మెట్రోకు సంబంధించిన రెండు కొత్త కారిడార్లు కూడా ఉన్నాయి.

గ్యాస్ ధరల సెగ: డొమెస్టిక్ ఎల్పీజీ (LPG) సిలిండర్ ధర ₹60 పెరగడంతో విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ ధరల పెరుగుదలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు.

బీహార్ రాజకీయాలు: బీహార్ తదుపరి సీఎంగా వినిపిస్తున్న సామ్రాట్ చౌదరి నేడు పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు

పశ్చిమ ఆసియా నుండి కేంద్ర ప్రభుత్వం గత ఏడు రోజుల్లో (మార్చి 1-7) సుమారు 52,000 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చింది.

Today International News

ఇరాన్ – అమెరికా ఉద్రిక్తతలు: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌పై యుద్ధం విషయంలో బ్రిటన్ సహకరించడం లేదని డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు.

సరిహద్దు దేశాలపై దాడి చేయబోమని, వారు దాడి చేస్తే తిరిగి దాడి చేస్తామని ఇరాన్ ప్రకటించింది.

Today Business News

బంగారం ధరలు: పెళ్లిళ్ల సీజన్‌లో సామాన్యులకు ఊరటనిస్తూ గత ఐదు రోజులుగా పసిడి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి.

మార్కెట్ అప్‌డేట్: గ్లోబల్ మార్కెట్ల ప్రభావంతో బిట్‌కాయిన్ మరియు ఇతర క్రిప్టో కరెన్సీల ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.

ITR E FILING 2026 గడువు తేదీలను వెల్లడించిన ఆదాయపన్ను శాఖ ‌

Today Sports News

టీ20 వరల్డ్ కప్ 2026: నేడు భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు ఈ పోరు ప్రారంభమవుతుంది.

ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరిన లక్ష్య సేన్. నేడే ఫైనల్

మహిళల ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఓటమి అంచును భారత్ నిలిచింది.

Today Education and Job Updates

CPGET 2026 నోటిఫికేషన్ ను త్వరలోనే కాకాతీయ యూనివర్సిటీ విడుదల చేయనుంది.

తెలంగాణ పాఠశాల విద్యార్థులకు మూడు రోజుల పాటు పాలు అందించనున్నారు

యూపీఎస్సీ ఫలితాలు: సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాల్లో తెలుగు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు.

ఏపీ టెన్త్ విద్యార్థులకు ఆఫర్: పరీక్షలకు వెళ్లే విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →