Today in history August 3rd – చరిత్రలో ఈరోజు ఆగస్టు 03

BIKKI NEWS : Today in history August 3rd – చరిత్రలో ఈరోజు ఆగస్టు 03

Today in history August 3rd

దినోత్సవం

  • ప్రపంచ స్నేహితుల దినోత్సవం (ఆగస్టు మొదటి ఆదివారం)
  • జాతీయ పుచ్చకాయ దినోత్సవము

సంఘటనలు

1777: మిలన్ నగరంలో లా స్కాల ఒపేరా హౌస్ని ప్రారంభించారు.
1858: విక్టోరియా సరస్సు (లేక్ విక్టోరియా), నైలు నది మొదలు అయ్యే ప్రాంతం అని కనుగొన్నారు
1907: పోర్చుగల్లో ఆదివారం విశ్రాంతి దినంగా పేర్కొంటూ, రాజాజ్ఞ జారీ అయ్యింది.
1914: కొత్త పనామా కాలువ గుండా మొదటి ఓడ ప్రయాణించింది
1957: తుంకు అబ్దుల్ రహ్మాన్, స్వతంత్ర మలేషియా దేశానికి, దేశాధిపతిగా, 5 సంవత్సరాలకి ఎన్నికయ్యాడు.
1958: మొదటి అణు జలాంతర్గామి పేరు నాటిలస్ అమెరికాకు చెందినది. ఇది మొదటిసారిగా, ఆర్కిటిక్ మహాసముద్రం నీటి అడుగునుంచి (నీటి లోపలి నుంచి), ప్రయాణం చేసి, ఉత్తర దృవాన్ని, దాటింది.
1978: ఇంగ్లాండ్ మహారాణి 11వ కామన్‌వెల్త్ గేమ్స్ని కెనడా లోని ఎడ్మంటన్ లో ప్రారంబింది.
1990: నెయిల్‌స్టోన్ వాతావరణ కేంద్రం (లీచెస్టర్ షైర్) మొదటిసారిగా, 37.1 సెంటిగ్రేడ్ (లేదా 99 ఫారెన్%హీట్) ఉష్ణోగ్రత ను, అత్యధిక ఉష్ణోగ్రతగా బ్రిటన్లో నమోదు చేసింది. 1911లో రికార్డు అయిన ఉష్ణోగ్రత కంటే, 1990లో 1 డిగ్రీ పారెన్‌హీట్ అధికంగా రికార్డు అయింది.
2003: అమెరికా లోని ఆంగ్లికన్ శాఖకు చెందిన, ఎపిస్కోపల్ ఛర్చ్, రెవరెండ్ జెనె రోబిన్సన్, అనే, హిజ్రా (కొజ్జా) ని బిషప్గా నియమించింది. ఈ నియామకానికి, ప్రపంచవ్యాప్తంగా, మత పెద్దలు నిరసనలు తెలియచేసారు. 2003 ఆగష్టు 5 లో ఈ నియామకం అంగీకరించబడింది.
2008: హిమాచల్ ప్రదేశ్ లోని నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 145 మంది భక్తులు మృతి చెందారు.

జననాలు

1656: కాకునూరి అప్పకవి, తెలుగు లాక్షణిక కవి. ‘ఆంధ్రశబ్ద చింతామణి ‘ ఆధారంగా ‘ఆంధ్రశబ్దచింతామణి ‘ అను ఛందో గ్రంథానికి రచయిత.
1886: మైథిలీ శరణ్ గుప్త, హిందీ రచయిత (మ.1964)
1913: శ్రీపాద పినాకపాణి, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, వైద్యరంగంలో నిష్ణాతుడు. (మ.2013)
1921: లావు బాలగంగాధరరావు, భారత కమ్యూనిస్టు పార్టీ – మార్క్సిస్టు నాయకుడు. (మ.2003)
1931: సూరి బాలకృష్ణ, భూ భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త (మ.1984)..
1948: వాణిశ్రీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినినటి.
1956: టి. మీనాకుమారి, న్యాయవాది. మేఘాలయ రాష్టానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి.
1983: ఆషీమా భల్లా , హిందీ, కన్నడ, తెలుగు, తమిళ, అస్సామీ చిత్రాల నటి .
1989: గౌరినంద , మలయాళం, తెలుగు, తమిళ చిత్రాల నటి.

మరణాలు

2008: పువ్వుల లక్ష్మీకాంతం, తొలితరం సినిమా నటి, గాయని, నర్తకీమణి, రంగస్థల నటి.
2011: వేగుంట మోహనప్రసాద్, కవి, రచయిత. (జ.1942)
2013: ప్రియంవద, తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు. (జ.1928)
2013: ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి, మాజీ మంత్రి, రాజకీయ కురువృద్దుడు. (జ.1933)
2017 : జీడిపల్లి విఠల్ రెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు. కామారెడ్డి శాసనసభ నియోజకవర్గ తొలి శాసనసభ్యుడు.