BIKKI NEWS (DEC. 20) : Mid day meals in GJC Alladurgam. ప్రభుత్వ జూనియర్ కళాశాల అల్లా దుర్గంలో శుక్రవారం నాడు విద్యార్థుల కొరకు మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
Mid day meals in GJC Alladurgam.
ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ కే. సత్తయ్య ప్రిన్సిపాల్ గా వచ్చిన తన మొదటి నెల వేతనాన్ని 97,770 రూపాయలు ఈ కార్యక్రమానికి నడిపించుట కొరకు అందించడం జరిగింది
మరియు అధ్యాపకులు శ్యామరావు తన వంతు సహాయంగా 5000/- మరియు స్థానికులు సహకారం అందిస్తున్నారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రిన్సిపాల్ మాట్లాడుతూ… పేద విద్యార్థులు రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవడం వలన ఉదయము ఉపవాసము వచ్చి సరియైన విద్యను పొందటం లేదని గ్రహించడం జరిగిందని, విద్యార్థులు కడుపునిండా భోజనం తింటేనే చదువుకున్న విద్య అవగాహన అవుతుందని తెలిపారు. అందుకు తన వంతుగా మధ్యాహ్న భోజనం విద్యార్థుల కొరకు అధ్యాపకుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వంట వండటానికి కార్యాలయ సిబ్బంది హేమలత ముందుకు వచ్చారు. గతములో ప్రారoభించిన రాగి జావా ఉపహార కార్యక్రమం కొనసాగుతున్నది.
ఈ కార్యక్రమ నిర్వహణకు సహకారం అందిస్తున్న స్థానిక అధికారులకు ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల అధ్యాపకులు తుకారాం శ్యామ్ రావు రవికుమార్ రవీందర్ , నరసింహారెడ్డి, ప్రవీణ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
- Today current affairs in Telugu May 12th 2026 – కరెంట్ అఫైర్స్
- Daily current affairs in Telugu May 11th 2026 – కరెంట్ అఫైర్స్
- Top current affairs 10th May 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 14th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- TG ICET 2026 Results విడుదల, ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి

