BIKKI NEWS (APRIL 20) : JL TO PRINCIPAL PROMOTIONS IN GOVERNMENT JUNIOR COLLEGES. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్లగా పనిచేస్తున్న 31 మందికి ప్రిన్సిపాల్ గా పదోన్నతులు కల్పించుటకు ఇంటర్మీడియట్ బోర్డ్ ఏప్రిల్ 22న మధ్యాహ్నం 3.00 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహించనుంది.
JL TO PRINCIPAL PROMOTIONS IN GOVERNMENT JUNIOR COLLEGES
గత మార్చి 16వ తేదీన నిర్వహించిన పదోన్నతులలో 53 మందికి గాను 31 మంది ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.
దీంతో మొత్తం ప్రస్తుత ఖాళీలు 31కి చేరగా వాటికి ఏప్రిల్ 22న కౌన్సిలింగ్ నిర్వహించడానికి అర్హులైన జూనియర్ లెక్చరర్ల పేర్లను తాజాగా విడుదల చేసింది.
తాజాగా 11 మంది ప్రిన్సిపాల్ లకు డిఐవోలుగా బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.
దీంతో ఇంటర్మీడియట్ విద్యను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య వేగవంతమైన చర్యలు చేపడుతున్నారు.
SENIORITY LIST OF JLS

