BIKKI NEWS (JAN. 10) : Reliance jio ipo for 40 thousand crores. రిలయన్స్ జియో సంస్థ 40,000 కోట్ల ఐపీఓ ను ఈ సంవత్సరంలోనే తీసుకువచ్చే అవకాశం ఉంది. దేశ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ గా నిలువనుంది.
Reliance jio ipo for 40 thousand crores.
జియో విలువ 16.2 0 లక్షల కోట్లుగా సంస్థ అంచనా వేసిన సంగతి తెలిసిందే ఇందులో కేవలం 2.5% వాటాలు విక్రయించడం ద్వారా 40,000 కోట్ల సమీకరణ చేపట్టాలని రిలయన్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే అతి పెద్ద కంపెనీలు ఐపిఓ కి రావాలంటే సంస్థ వాటాలో కనీసం 5 శాతాన్ని విక్రయించాలని చెబుతున్నాయి. దీన్ని 2.5 శాతానికి తగ్గించిన తర్వాతే జియో ఐపిఓ కు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి.
ఇప్పటివరకు మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపివోలుగా నిలిచిన టాప్ 5 ఐపీవో లు ఇవే…
1) హ్యుందాయ్ – 27,870 కోట్లు
2) ఎల్ఐసి – 21,006 కోట్లు
3) పేటీఎమ్ – 18,300 కోట్లు
4) జీఐసీ – 11,176 కోట్లు
5) ఎన్ఐఏ – 9,600 కోట్లు

