BIKKI NEWS (JAN. 04) : AP DSC 2026 NOTIFICATION IN FEBRUARY. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో 2,500 టీచర్ పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది.
AP DSC 2026 NOTIFICATION IN FEBRUARY
ఇదుకు సంబంధించి ఖాళీల వివరాలను సేకరించింది. త్వరలోనే జిల్లాల వారి ఖాళీల వివరాలతో కూడిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి విద్యాశాఖ సమర్పించి ఆమోదం పొందనుంది. అనంతరం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
అయితే ఈసారి డీఎస్సీ పరీక్షల్లో నూతన పేపర్ ను ప్రవేశపెట్టే ఆలోచనను ప్రభుత్వం చేస్తుంది.
ఇంగ్లీష్ & కంప్యూటర్ పరిజ్ఞానం తో కూడిన ఈ పేపర్ ను ప్రవేశపెట్టే యోచనలో విద్యాశాఖ ఉంది. దీనికి కూడా ప్రభుత్వం నుంచి ఆమోదం లభించాల్సి ఉంది.

