జీవోలను తక్షణం అధికారిక వెబ్‌సైట్‌లలో ఉంచాలి - హైకోర్టు - bikki news

జీవోలను తక్షణం అధికారిక వెబ్‌సైట్‌లలో ఉంచాలి – హైకోర్టు

BIKKI NEWS (DEC. 24) : All GOs must upload in public domains says high court. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అన్ని ఉత్తర్వులు (జీవోలు), నోటిఫికేషన్లు, నిబంధనలు, సర్క్యులర్లను తక్షణం ఆయా శాఖల అధికారిక వెబ్‌సైట్‌లలో ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

All GOs must upload in public domains says high court.

జీవోలను, సర్క్యులర్లను అధికారిక వెబ్‌సైట్‌లలో ఉంచకపోవడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది ‌ దీనిపై జస్టిస్‌ సూరేపల్లి నంద మంగళవారం విచారణ చేపట్టారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2023 డిసెంబరు నుంచి 2025 జనవరి దాకా 19,064 జీవోలు జారీచేయగా కేవలం 3,290 మాత్రమే అందుబాటులో ఉన్నాయని, మిగిలిన 15,774 జీవోలు కనిపించడం లేదన్నారు.

వాదనలను విన్న న్యాయమూర్తి 2022లో డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని, తక్షణం జీవోలను, ఇతర సర్క్యులర్లను అధికారిక వెబ్‌సైట్‌లలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను ముగించారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →