BIKKI NEWS (JAN. 09) : Paper leakage in Telangana agriculture University. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పేపర్ లీకేజీ అంశం కలకలం రేపింది. ప్రశ్నాపత్రాల లీకేజ్ పై చేపట్టిన విచారణ కమిటీ నివేదికతో ఈ చర్యలను తీసుకున్నారు
Paper leakage in Telangana agriculture University.
పేపర్ లీకేజీ కి కారణమైన నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అలాగే వ్యవసాయ శాఖలో ఏ వీలుగా పని చేస్తూ బిఎస్సి మూడవ సంవత్సరం ఇన్ సర్వీస్ స్టూడెంట్స్ గా ఉన్న 35 మంది అభ్యర్థులను కూడా డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
జగిత్యాల వ్యవసాయ కళాశాలలో ఇటీవల పర్యటించిన వీసీ అక్కడ రికార్డులను పరిశీలిస్తూ సీసీ కెమెరాలను పరిశీలిస్తుండగా ఈ అంశం వెలుగులోకి వచ్చింది.
దీంతో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ లోతుగా అధ్యయనం చేసి పేపర్ లీకేజీకి కారణమైన నలుగురు ఉద్యోగులను, 35 మంది ఇన్ సర్వీస్ కోటాలో చదువుతున్న ఏఈ లపై చర్యలు తీసుకోవాల్సిందిగా సిఫారసు చేసింది.

