BIKKI NEWS (MAR. 12) : Free bus for students of government schools and colleges. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా లేదా 50% రాయితీతో రవాణా సౌకర్యం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Free bus for students of government schools and colleges
ఇప్పటికే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణసౌకర్యం కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం… ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఉచిత రవాణా లేదా సగం రాయితీతో రవాణా కల్పించే అంశాన్ని పరిశీలిస్తుందని సీఎం తెలిపారు.
2026 -27 విద్యా సంవత్సరం నుంచి నర్సరీ నుండి 12వ తరగతి వరకు ప్రత్యేక విద్యా విధానాన్ని అమల్లోకి తెస్తామని తెలిపారు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేసి బ్రేక్ ఫాస్ట్ మరియు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందిస్తామని తెలిపారు.
అలాగే ఇప్పటికే ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థినిలకు ఎలక్ట్రిక్ స్కూటీలను ఉచితంగా అందజేయాలని ఆలోచన కూడా సీఎం రేవంత్ రెడ్డి వెలిబుచ్చారు.

