Mid day meals in government junior colleges

MID DAY MEALS – ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మిడ్ డే మీల్స్

BIKKI NEWS (JAN. 09) : MID DAY MEALS IN GOVERNMENT JUNIOR COLLEGES. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ మరియు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం.

MID DAY MEALS IN GOVERNMENT JUNIOR COLLEGES

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 330 కళాశాలలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయని విద్యార్థులు దూరాభారాల నుండి కళాశాలలకు వస్తుంటారని, ఈ పథకం అమలు చేయడం ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు డైరెక్టర్ శ్రీకృష్ణ కృష్ణ ఆదిత్య సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్, అమలు విధానం ఒంటి అంశాలపై సమగ్ర నివేదిక అందించాలని కోరారని తెలిసింది.

అలాగే 9, 10 తరగతులు మరియు ఇంటర్మీడియట్ విద్య ఒకే ఆవరణలో ఉండాలని అంశం పైన కూడా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు.

విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి జరిపిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →