BIKKI NEWS (MAR. 04) : Telangana Education Policy starts with in month. తెలంగాణ రాష్ట్రంలో నూతన విద్య విధానాన్ని నెల రోజుల్లో అమలు చేస్తామని ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు ఈరోజు ప్రకటించారు.
Telangana Education Policy starts with in month
నూతన విద్యా విధానం అమలు తీరుపై ఆకునూరి మురళి నేతృత్వంలో వేసిన కమిటీ తాజాగా ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసిన సంగతి తెలిసిందే
ప్రభుత్వ ఉపాధ్యాయులు అధ్యాపకులకు వేతనాలు తగ్గించాలని కమిషన్ లోని ప్రతిపాదనలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, తగ్గించబోమని తెలిపారు.
Read Also : Free Online Tests
ఉపాధ్యాయ సంఘాలను పిలిచి చర్చలు జరుపుతామని ఈ సందర్భంగా తెలిపారు.
ప్రభుత్వం అన్ని జీవోలను పబ్లిక్ డొమైన్లు అందుబాటులో ఉంచుతుందని తద్వారా పారదర్శకత నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.
ఇప్పటివరకు విద్యా కమిషన్ 14 కమిటీలను వేసిందని మీ, ఆ కమిటీల నివేదికల అనంతరం విద్యా కమిషన్ తుది రూపు దిద్దుకుని నూతన విద్యాపాలసి అమలులోకి వస్తుందని తెలిపారు.
అయితే ఈ బడ్జెట్ సమావేశాలలో నూతన విద్యా విధానం అమలుకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం పుష్కలంగా ఉంది.
వచ్చే విద్యా సంవత్సరం నాటికి నూతన విద్యా విధానం కేజీ నుండి పేజీ వరకు అమలు చేయాలని దృడ నిశ్చయంతో విద్యాశాఖ మంత్రి కూడా అయినా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం.

