BIKKI NEWS (FEB. 25) : Inter board director ari Krishna Adithya visited Exam centres. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి శ్రీ కృష్ణ ఆదిత్య గారు ఈ రోజు సికింద్రాబాద్ మరియు మారేడుపల్లి ప్రాంతాలలోని పలు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా కేంద్రాలను సందర్శించి, పరీక్షల నిర్వహణ మరియు విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను సమీక్షించారు.
Inter board director ari Krishna Adithya visited Exam centres
ఈ సందర్భంగా కార్యదర్శి గారు పరీక్షా ఏర్పాట్లను పరిశీలించి, సిబ్బందితో మాట్లాడి, పరీక్షలు సజావుగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జారీ చేసిన మార్గదర్శకాల అమలును సమీక్షించారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి గారు క్రింది పరీక్షా కేంద్రాలను సందర్శించారు: అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్, సికింద్రాబాద్: సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్, సికింద్రాబాద్: సెయింట్ మేరీస్ సెంచెనరీ జూనియర్ కాలేజ్, సికింద్రాబాద్: ఎంఆర్ఎంఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్, మారేడుపల్లి: ఎక్సెలెన్షియా జూనియర్ కాలేజ్, మారేడుపల్లి, కేంద్రాలలో చేసిన ఏర్పాట్లపై కార్యదర్శి గారు సంతృప్తి వ్యక్తం చేసి, పరిక్షలన్ని పూర్తి అయేవరకు ఇదే ప్రమాణాలను కొనసాగించాలని అధికారులకు సూచించారు.

