BIKKI NEWS (NOV. 07) : 9600 rupees subsidy for farmers in Telangana. కూరగాయలు సాగు చేసే రైతుల ఖాతాలో ఎగరానికి 9,600 రూపాయల చొప్పున జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
9600 rupees subsidy for farmers in Telangana.
ఒక్కో రైతుకు గరిష్టంగా 5 ఎకరాల వరకు సబ్సిడీని అందించనుంది. అంటే గరిష్టంగా ఒక్కో రైతుకు 48,000 రూపాయల చొప్పున సబ్సిడీని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో కూరగాయల కొరతను నివారించడానికి, కూరగాయల సాగును పెంచేందుకు రైతులకు ఈ సబ్సిడీని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఒక ఎకరా కూరగాయల సాగుకు 24 వేల ఖర్చు వస్తుందని అంచనా వేసి అందులో 40% నిధులను అనగా 9,600రూపాయాలను నేరుగా రైతుల ఖాతాలు వేయాలని నిర్ణయం తీసుకున్నారు.

