BIKKI NEWS (AUG. 31) : AIIMS MANGALAGIRI BSc admissions 2025. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి 2025–26 విద్యాసంవత్సరానికి బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ మరియు బీఎస్సీ హీమటాలజీ & ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
AIIMS MANGALAGIRI BSc admissions 2025
నీట్ (NEET UG 2025) ర్యాంకు సాధించిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఏఐఐఎంఎస్ అధికారులు తెలిపారు.
బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ కోర్సుకు 20 సీట్లు, బీఎస్సీ హీమటాలజీ & ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ కోర్సుకు 5 సీట్లు కేటాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15, 2025 సాయంత్రం 5 గంటల వరకు అని స్పష్టం చేశారు.
పూర్తి వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.aiimsmangalagiri.edu.in ను సందర్శించాలని సూచించారు.

