BIKKI NEWS (FEB. 18) : special classes for students between SSC EXAMS 2026. తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 మధ్యలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
special classes for students between SSC EXAMS 2026
ఈసారి నిర్వహించే పరీక్షల మధ్య 3-5 రోజుల వ్యవధి ఉంటున్న నేపథ్యంలో విద్యార్థులకు పాఠశాలలో స్టడీ అవర్స్, ప్రత్యేక తరగతులు నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని పాఠశాల విద్యాశాఖ డీఈవోలను ఆదేశించింది.
రాష్ట్రంలో మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు మొదలు కానున్నాయి. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే లక్ష్యంతో గతానికి భిన్నంగా ఈసారి పరీక్షకు, పరీక్షకు మధ్య 3-5 రోజుల వ్యవధి ఉండేలా విద్యాశాఖ షెడ్యూలు రూపొందించింది.
- మొదటి పీరియడ్లో రివిజన్, ముఖ్యమైన అంశాలు, పార్ములాలను ఉపాధ్యాయులు వివరించాలి.
- రెండో పీరియడ్ లో గత ప్రశ్నా పత్రాల ఆధారంగా పరీక్ష నిర్వహించాలి.
- మూడో పీరియడ్ లో జవాబులు ఎలా రాయాలి? విద్యార్థులు ఎక్కడ తప్పులు చేస్తున్నారు? అనేది విశ్లేషిస్తూ సరైన మార్గనిర్దేశం చేయాలి.

