BIKKI NEWS (NOV. 11) : ANOTHER BUS FIRE ACCIDENT AT CHITYALA. హైదరాబాద్ విజయవాడ హైవే మీద నల్గొండ జిల్లా చిట్యాల దగ్గరలోని వెలిమినేడు గ్రామం వద్ద విహారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అగ్ని ప్రమాదానికి గురైంది.
ANOTHER BUS FIRE ACCIDENT AT CHITYALA.
వెంటనే తేరుకున్న ప్రయాణికులు అద్దాలను పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలను కాపాడుకున్నారు.
ప్రమాద సమయంలో బస్సులు 29 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ప్రమాదానికి గురైన బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద సంఘటనలో 19మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అలాగే తాండూరు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో కూడా 20 మంది వరకు మృతి చెందిన విషయం తెలిసిందే.

