BIKKI NEWS (MAR. 15) : Today top news in Telugu March 15th 2026 – నేటి ప్రధాన వార్తలు
Today top news in Telugu March 15th 2026
Today Telangana News
బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫామ్హౌస్పై దాడి: మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్హౌస్పై పోలీసులు శనివారం అర్ధరాత్రి దాడులు చేశారు. అక్కడ కొకైన్ (Cocaine) లభించినట్లు సమాచారం. ఈ పార్టీలో ఎలూరు ఎంపీతో పాటు ఢిల్లీకి చెందిన ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది.
బడ్జెట్ సమావేశాలు రేపటి నుండే: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపు (మార్చి 16) ఉదయం 11:45 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. మార్చి 20న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
ఐపీఎస్ అధికారులకు గ్రేడింగ్: రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారుల పనితీరును బట్టి ఏ, బి, సి గ్రేడింగ్లు ఇచ్చే కొత్త విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి అమలులోకి తెచ్చారు. ఇకపై సిఫార్సులు కాకుండా పనితీరు ఆధారంగానే పోస్టింగ్స్ ఉంటాయని స్పష్టం చేశారు.
ఎలక్ట్రిక్ ఆటోలు: హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు 1.26 లక్షల ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
వడగళ్ల వాన హెచ్చరిక: రానున్న 48 గంటల్లో (మార్చి 15, 16) ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి (IMD) హెచ్చరించింది.
సెన్సస్ (జనగణన) అప్డేట్: తెలంగాణలో ఏప్రిల్ 26 నుండి ‘సెల్ఫ్-ఎన్యుమరేషన్’ (స్వీయ గణన) ద్వారా జనగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశంలోనే అత్యధికంగా భౌగోళిక సరిహద్దు మార్పులు జరిగిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది
మూసీ ప్రాజెక్ట్పై మాటల యుద్ధం: మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం భూకబ్జాలకు కవచంగా వాడుకుంటోందని కేటీఆర్ ఆరోపించారు.
గ్యాస్ కొరతపై నిరసనలు: రాష్ట్రంలో కమర్షియల్ ఎల్పీజీ సరఫరా కేవలం 20% మాత్రమే ఉందని, దీనివల్ల హోటళ్లు మూతపడుతున్నాయని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
UDICE – యుడైస్ గణాంకాల ప్రకారం 1-5 వారు తరగతి వరకు 68 శాతం పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు వెళుతున్నట్లు తెలిసింది.
Today A.P. News
మెగా స్టీల్ ప్లాంట్: కడపలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ (AMNS) ప్లాంట్ నిర్మాణ పనులు మార్చి 23 నుండి ప్రారంభం కానున్నాయి.
తిరుమల లడ్డూ వివాదం: లడ్డూ పై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారన్న పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
క్వాంటమ్ వ్యాలీ (Quantum Valley): అమరావతిని గ్లోబల్ టెక్నాలజీ హబ్గా మార్చేందుకు ‘క్వాంటమ్ వ్యాలీ’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇది ఐటీ రంగం తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద టెక్ విప్లవంగా మారనుంది.
మల్టీ-విలేజ్ స్కీమ్స్: రాష్ట్రవ్యాప్తంగా 76 మండలాల్లో సుమారు 65 లక్షల మందికి తాగునీరు అందించేందుకు ₹9,355 కోట్లతో ఏడు బహుళ గ్రామ పథకాలకు (MVS) పరిపాలన అనుమతులు ఇచ్చారు.
Today National News
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అస్సాంలోని సిల్చార్లో పర్యటించి, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు.
భారత నౌకల రాక: గల్ఫ్ దేశాల నుండి ఎల్పీజీ లోడ్తో వస్తున్న రెండు భారతీయ నౌకలు (శివాలిక్ మరియు నందా దేవి) హార్మూజ్ జలసంధిని దాటి క్షేమంగా భారత్ వైపు వస్తున్నాయని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తెలిపింది.
జ్ఞానపీఠ్ పురస్కారం 2025 : తమిళ రచయిత వైరముత్తు జ్ఞానపీఠ్ పురస్కారం ప్రకటించారు. వైకరై మఖంఘల్ అనే పాటలో సంకలనం కు ఈ పురష్కారం ప్రకటించారు.
ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ 6 నెలల సుదీర్ఘ గృహ నిర్బంధం (Detention) తర్వాత నేడు (మార్చి 15) విడుదలయ్యారు.
టెక్నికల్ ఫెయిల్యూర్: ప్రస్తుతం పని చేస్తున్న 4 ప్రధాన IRNSS (NavIC) ఉపగ్రహాలలో ఒకటి సాంకేతిక లోపంతో విఫలమైనట్లు సమాచారం. దీనివల్ల జీపీఎస్ సేవల ఖచ్చితత్వంపై స్వల్ప ప్రభావం పడే అవకాశం ఉంది. దీని స్థానంలో కొత్త శాటిలైట్ను ప్రయోగించేందుకు ఇస్రో కసరత్తు చేస్తోంది
Today International News
ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం: ఇరాన్ చమురు కేంద్రమైన ఖార్గ్ ఐలాండ్పై అమెరికా మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు, ఇరాన్ నిఘా విభాగం కీలక అధికారులిద్దరిని చంపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
Today Business News
బంగారం & వెండి: యుద్ధ భయాల వల్ల ధరల్లో అనిశ్చితి కొనసాగుతోంది. వెండి ధర కేజీకి ₹2.60 లక్షల వద్ద ఉంది.
మార్కెట్ విశ్లేషణ: ఆసియా మార్కెట్లలో భారత స్టాక్ మార్కెట్ ప్రస్తుతం అత్యంత ఖరీదైనదిగా ఉందని ఐపిఓ నివేదికలు చెబుతున్నాయి.
ఫేక్ ఈమెయిల్స్: పన్ను చెల్లింపుదారులకు వారి ట్రాన్సాక్షన్లకు సంబంధించి వస్తున్న కొన్ని తప్పుడు ఈమెయిల్స్ను పట్టించుకోవద్దని ఐటీ శాఖ సూచించింది. సాంకేతిక లోపం వల్ల కొన్ని నోటీసులు తప్పుగా వెళ్లాయని, వాటిని విస్మరించాలని తెలిపింది
Today Sports News
భారత మహిళా హాకీ జట్టు ఫైనల్లో ఇంగ్లాండ్తో తలపడి 0-2 తేడాతో ఓటమిపాలైంది. దీంతో భారత్ రన్నరప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకుంది.
ఎఫ్1 రద్దు: పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల బహ్రెయిన్, సౌదీ అరేబియా ఫార్ములా వన్ గ్రాండ్ ప్రిక్స్లు రద్దయ్యాయి.
అస్సాం కు చెందిన మాయాంక్ చక్రవర్తి భారత 94వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా నిలిచాడు
వరల్డ్ పారా అథ్లెటిక్స్: న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్లో భారత్ 208 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో సుమిత్ ఆంటిల్ జావలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించారు.
Today Education and Job Updates
ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు. తొలి రోజు 99.65% విద్యార్థులు హాజరు.
TG DEECET 2026 – నేటి నుంచి తెలంగాణ డిఈఈ సెట్ 2026 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ఏప్రిల్ 15 వరకు అవకాశం కలదు

