BIKK NEWS (MAR. 08) : Free Electric Scooties for college students in Telangana – తెలంగాణ రాష్ట్రంలోని కళాశాల విద్యార్థినులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలను అందజేసేందుకు ఆలోచన చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ ఉచిత స్కూటీల పథకం అమలుకు మరియు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
Free Electric Scooties for college students in Telangana
ఈరోజు ప్రజాభవన్ లో నిర్వహించిన మహిళా దినోత్సవం వేడుకలలో ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు.
Also Read : ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలులో రాయితీ
ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం కళాశాల విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలను అందించడం ద్వారా కాలుష్య రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని తెలిపారు.
హైదరాబాద్ నగరంలోని అన్ని డీజిల్ బస్సులను డిసెంబర్ వరకు జిల్లాలకు పంపించి, హైదరాబాద్ పరిధిలో కేవలం ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడుపుతామని స్పష్టం చేశారు.
ఎలక్ట్రిక్ వాహనాలకు జీరో ట్వాక్స్ . విధానాన్ని అమలు చేస్తామని కూడా తెలిపారు.
హైదరాబాద్ నగరంలోని ఆరెంజ్, రెడ్ కేటగిరిలో ఉన్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిపారు.

